telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అధికారికంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి: మంత్రి వెల్లంపల్లి

srinivasa rao minister

ఈ నెల 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కి వెల్లంపల్లి, పొట్టిశ్రీరాములు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అన్నిప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

Related posts