‘అలగా జనం’ అని వైసీపీ పేర్కొన్న వాళ్లే ఇప్పుడు గేమ్ చేంజర్లు అవుతున్నారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేసిన మైనర్లను వైసీపీ వాళ్లు ‘అలగా జనం’ అని వ్యాఖ్యానించారని వెల్లడించారు.
నాటి మైనర్లే ఇప్పుడు మేజర్లు అయ్యారని, ఓటు వేసి ప్రతీకారం తీర్చుకోవడానికి తహతహలాడుతున్నారని నరేశ్ పేర్కొన్నారు.
ఈ ‘జనం’ ఈసారి ఎన్నికల్లో తియ్యని ప్రతీకారం తీర్చుకోవడమే కాదు, తియ్యని విజయం సాధించబోతున్నారు అని వివరించారు.