సినిమా రంగానికి చెందిన కొన్ని పోస్టులు రాజకీయాలకు ముడిపడి ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్. చైర్మన్ పోస్ట్ ను ఏపి ప్రభుత్వం నియమిస్తుంది. ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారికి ఈ పోస్ట్ ఇస్తుంది. అందుకే మన సినిమావాళ్లు ఆయా ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉంటారు. ఈ పోస్ట్ కోసం కొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే ట్రై చేస్తున్నారు. జగన్ తో టచ్ లో ఉన్నారు. వాళ్లలో మోహన్ బాబు, జయసుధ, జీవిత రాజశేఖర్ లు ఉన్నారు. మోహన్ బాబు జగన్ కు చాలా క్లోజ్ అని చెప్పొచ్చు. పైగా ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది. ఈ బంధుత్వం కారణంగా ఆయనకు ఈ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
మోహన్ బాబు టిటిడి చైర్మన్ పోస్ట్ ను ఆశిస్తున్నారు. ఒకవేళ ఆ పోస్ట్ కాకపోతే మోహన్ బాబుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ పోస్ట్ కోసం జయసుధ నుంచి కూడా ఒత్తిడి మొదలైందని తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఆమె చురుకైన పాత్ర పోషించింది. ఎమ్మెల్యేగా కూడా పనిచేసింది. ఏపి ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ పోస్ట్ కోసం జయసుధ ప్రయత్నిస్తోంది. మోహన్ బాబుకు ఎలాగో టిటిడి చైర్మన్ పోస్ట్ ఇస్తారు కాబట్టి తనకే ఈ అవకాశం వస్తుంది అన్నది జయసుధ నమ్మకం. జీవితా రాజశేఖర్ లు కూడా ఈ పోస్ట్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. మరి ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.
టీటీడీ బోర్డును సీబీఐ ఛార్జ్ షీట్ లా చేశారు: అనురాధ ఫైర్