గొర్రెకుంట మృత్యు బావి కేసులో నిందితుడు సంజయ్ కుమార్ ఇవాళ కోర్టుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య నిందితుడు సంజయ్ కుమార్ ను కోర్టుకు తరలించారు పోలీసులు. కొద్దిసేపటి క్రితమే వరంగల్ జిల్లా కోర్టుకు పోలీసు బలగాల మధ్య చేరుకున్నాడు నిందితుడు. వరంగల్ జిల్లా కోర్టు వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. అధికారులు సీఐ జూపల్లి శివరామయ్య, ఏ సి పి శ్యామ్ సుందర్ కోర్టుకు విచారణ అధికారులు హాజరైయ్యారు. ఈ హత్యల కేసులో కీలకమైన వాదోపవాదాలు డి డి పి సత్యనారాయణ చేస్తున్నారు. కాగా..బీహార్కు చెందిన సంజయ్కుమార్ తొమ్మిది మందికి కూల్డ్రింక్లో మత్తు మందు ఇచ్చి బావిలో పడేశాడు. రెండు నెలలుగా కనిపించకుండా పోయిన ఓ అమ్మాయి విషయంలో సంజయ్కుమార్ను మక్సూద్ కుటుంబం నిలదీసినందుకే ఈ హత్యలు చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ కేసు తుది తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనుంది.అయితే ఎలాంటి తీర్పు వస్తుందో అని అందరు ఏడుకరు చూస్తున్నారు.
previous post
next post
మొదటి నుంచీ అయోమయ ప్రకటనలు… కరోనా నుంచి ఉపశమనం ఎప్పుడు… : విజయశాంతి