హైదరాబాద్ మంగళ్హాట్లోని న్యూ ఆగాపురాలో ఓ యునానీ వైద్యుడు కరోనా బారినపడ్డాడు. బాధితుడు న్యూ ఉస్మాన్గంజ్లో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో నెల రోజులుగా క్లినిక్ మూసేసి ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే, గత నెల 29న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో జూబ్లీహిల్స్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.
శుక్రవారం ఉదయం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. యునానీ వైద్యుడు నివసించే ఆగపురాలోని అతని ఇంటిని జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు సెల్ఫ్ క్వారంటైన్గా ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వైద్యుడి కుటుంబసభ్యులతో పాటు వాచ్మెన్ కుటుంబసభ్యుల్ని సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచామని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగానే వరదలు: దేవినేని ఫైర్