ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే మళ్లీ పుంజుకుంటుంది. విభజన తర్వాత, ఓటర్లు వరుసగా రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు.
అయితే, వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి రావడం, అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం జరిగింది.
తాజాగా అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా కాంగ్రెస్లో చేరడం గమనార్హం.
చింతలపూడిలో ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో పాటు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వైఎస్ షర్మిల శుక్రవారం చింతలపూడిలో ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 23 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఐదేళ్ల క్రితం చేసిన హామీ మాట తప్పారని అన్నారు.
ఐదేళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు నిరుద్యోగ వ్యక్తులును మోసం చేశారని ఆరోపించారు.
YSR శంకుస్థాపన చేసిన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అసంపూర్తిగా మిగిలిపోయిందని, శ్రీమతి ఎలిజా తన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాన్ని షర్మిల ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎమ్మెల్యే ఎలిజా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని షర్మిల స్పీచ్ ఇచ్చారు.
వైఎస్ జగన్ మీరు తిరిగిన ప్రతిచోటా ఇసుక మాఫియా, భూ మాఫియా మరియు మద్యం మాఫియా అని వైఎస్ షర్మిల విమర్శించారు.
గత దశాబ్ద కాలంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోయాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విభజన హామీలను సత్వరమే అమలు చేస్తామని షర్మిల స్పష్టం చేశారు.
రామ మందిర విరాళాల సేకరణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు…