telugu navyamedia
వార్తలు సామాజిక

జైలు కౌంట‌ర్ల వ‌ద్దనే రాఖీలు అందజేయాలి!

rakhee silver

క‌రోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జైళ్ల‌ల్లో రాఖీ పండుగ‌పై ఆంక్ష‌లు విధించారు. ఆ రోజున జైళ్ల వ‌ద్దకు ఖైదీల తోబుట్టువుల‌ను అనుమ‌తించ‌మ‌ని ఓ అధికారి స్ప‌ష్టం చేశారు. ఒక వేళ తోబుట్టువులు వ‌చ్చినా… ఖైదీల‌ను క‌లిసే అవ‌కాశం ఉండ‌ద‌న్నారు. ఖైదీల‌కు రాఖీలు క‌ట్టాల‌నుకునే వారు.. ఆగ‌స్టు 1వ తేదీలోపే జైలు కౌంట‌ర్ల వ‌ద్ద ఇచ్చేయాల‌ని సూచించారు. ఆ రాఖీల‌ను పూర్తిగా శుభ్ర‌ప‌రిచిన త‌ర్వాతే ఖైదీల‌కు ఇస్తామ‌ని తెలిపారు.

క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు జైలు అధికారులు స్ప‌ష్టం చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,951కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 27,934, కాగా 44,520 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 1497కు చేరింది.

Related posts