telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని..వంగవీటి రాధా ‘శ్రీయాగం’ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడే మళ్లీ సీఎం కావాలని టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ  విజయవాడలోని కేజే గుప్తా కళ్యాణ మండపంలో  శ్రీయాగం ప్రారంభించారు. ఆదివారం రాధా సోదరి ఆషా దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోపూజ, వాస్తు హోమం అనంతరం దుర్గామత పూజతో ప్రారంభమైన శ్రీయాగం మూడు రోజులుపాటు జరుగుతుందన్నారు. ఈయాగం ఏప్రిల్ 3 న పూర్ణాహుతితో ముగిస్తుందని రుత్వికులు తెలిపారు. 
శ్రీయాగం ద్వారా శత్రుపీడ తొలగిపోయి అనుకున్న సంకల్పం నెరవేరుతుందని రుత్వికులు స్పష్టం చేశారు. ప్రజల సుఖసంతోషాలు, నదీజలాల పరిరక్షణ, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం శ్రీయాగం చేయిస్తున్నట్లు వంగవీటి రాధా తెలిపారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం చేస్తున్నట్టు  రాధా వివరించారు.

Related posts