telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొత్తపల్లి గీత

Geetha kothapalli

ఆంధ్రప్రదేశ్‌లోని అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఈరోజు బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీ అధిష్ఠానం తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి అరకులోయ ఎంపీగా గెలుపొందిన గీత ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు. అంతేకాకుండా గత ఏడాది తాను స్థాపించిన జనజాగృతి రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

Related posts