తమిళనాడుకు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. కృష్ణగిరిలో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచ్ఛారంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న పార్టీలచే పాలించబడదన్నారు. .తమిళనాడు నుంచే ఈ రాష్ట్ర పాలన జరుగుతుందన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ – డీఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. తమిళనాడులో 39, పుదుచ్చేరిలో 1 లోక్సభ స్థానం ఉంది. అయితే మొత్తం 40 సీట్లలో కాంగ్రెస్ 10 స్థానాల్లో(తమిళనాడు 9, పుదుచ్చేరి 1) పోటీ చేస్తుంది. మిగిలిన 30 స్థానాల్లో డీఎంకే తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా, అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కలిసి మహాకూటమిగా ఆవిర్భవించాయి. మొత్తం 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ 5, పీఎంకే 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా – డీఎల్