తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, ఆ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.. చంద్రబాబు డిమాండ్