telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ కండువాలు కప్పుకున్న టీడీపీ ఎమ్మెల్యే కుమారులు!

Tdp Vasupalli Ganesh

ఏపీలో టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా, విశాఖ ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ తన కుమారులతో కలిసి సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సీఎం జగన్ ను కలిసిన వాసుపల్లి గణేశ్ వైసీపీకి మద్దతు పలికారు.

ఈ సందర్భంగా వాసుపల్లి తనయులు సూర్య, గోవింద్ సాకేత్ ఇద్దరూ వైసీపీ కండువాలు కప్పుకున్నారు. సీఎం జగన్ నాయకత్వంపై వాసుపల్లి ప్రశంసలు కురిపించారు. ఈ సమయంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కూడా ఉన్నారు.

Related posts