శర్వానంద్ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో “మహాసముద్రం” సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ‘ప్రస్థానం’, ‘గమ్యం’ చిత్రాల తర్వాత శర్వానంద్ చిరకాలం గుర్తుండిపోయే ఉద్వేగభరితమైన, బలమైన పాత్రను చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఛాలెంజింగ్ రోల్ను చేయబోతున్నందుకు శర్వానంద్ అమితోత్సాహంతో ఉన్నారు. ఇంటెన్స్ లవ్-యాక్షన్ డ్రామాగా తయారయ్యే ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ దాదాపుగా పూర్తి అయ్యింది. కరోనా ఉదృతి కాస్త అయినా తగ్గితే సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని దర్శకుడు ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పై గత కొంతకాలంగా పలు పేర్లు వినిపించాయి. తాజాగా నాని హీరోయిన్ ను “మహాసముద్రం” కోసం అనుకుంటున్నారట. నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో పరిచయమైన ప్రియాంక అరుళ్ మోహన్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారట. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘శ్రీకారం’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ప్రియాంకా. ‘మహాసముద్రం’లో కూడా ఈ అమ్మడినే రిపీట్ చేయనున్నాడు శర్వానంద్. మేకర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారని సమాచారం.
previous post
ఆ నర్స్ ను బాగా వాడేసి వదిలేశావ్… గుర్తుందా ?… తేజపై శ్రీరెడ్డిపై తేజ సంచలన ఆరోపణలు