telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధానిని మార్చడం జగన్ వల్ల కాదు: ఎంపీ కేశినేని

kesineni-nani

చలో అసెంబ్లీకి టీడీపీ పిలుపునివ్వడంతో ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. ఒక ఎంపీ అయిన తనను చేయడం హౌస్ అరెస్టు ఏంటని కేశినేని నాని ప్రశ్నించారు. ప్రభుత్వం పోలీసులను వాడుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తినా? ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలని ప్రజల కోరుతున్నారన్నారని, అటువంటి రాజధానిని మార్చడం జగన్ వల్ల కాదని అన్నారు. పిచ్చి పిచ్చి కమిటీలు వేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రైతులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 

Related posts