telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం

Accident

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకువెళ్లడంతో 14 మంది దుర్మరణం పాలయ్యారు.సింధుపాక్ చౌక్ జిల్లాలోని కాలిన చౌక్ మందిరానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

డోలాఖా ఖాదీచౌర్ – జిరి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోయలో పడిపోయింది. ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Related posts