ఏపీ రాజధాని విషయంలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై రాజధాని మహిళా రైతులు కంటతడి పెట్టుకున్నారు. ఈ రోజు అసెంబ్లీ సమీపానికి చేరుకున్న మహిళా రైతులు మీడియాతో మాట్లాడుతూ తమకు అన్యాయం చేయొద్దంటూ బోరున విలపించారు.
పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటూ కొత్తగా తమను ఇబ్బంది పెట్టేలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని రాజధాని మహిళలు నిలదీశారు. వెలగపూడి పొలాల నుంచి అసెంబ్లీ ముట్టడికి రైతులు, మహిళలు ర్యాలీగా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది.