telugu navyamedia
రాజకీయ వార్తలు

అవిశ్వాస తీర్మానానికి మేము సిద్దం.. యడ్యూరప్ప సంచలన ప్రకటన

yadurappa on audio tape

కర్ణాటకలో రాజకీయం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో హెచ్‌డీ కుమార స్వామి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప శనివారంనాడు తెలిపారు. తమ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమేనంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ మరుసటి రోజే మేము సైతం ‘అవిశ్వాస తీర్మానానికి’ సిద్ధమంటూ యడ్యూరప్ప ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మీడియాతో యడ్యూరప్ప మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మాకేమీ అభ్యంతరం లేదు. సోమవారం వరకూ వేచిచూస్తాం. అప్పటికల్లా అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతమని యడ్యూరప్ప చెప్పారు.మరోవైపు రాజీనామా చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు శనివారం ముమ్మర ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరున్న రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్ హౌసింగ్ మంత్రి ఎంబీటీ నాగరాజ్ నివాసానికి చేరుకుని ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.

Related posts