ఏపీలో పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. సోమవారం రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటీసు ప్రకటిస్తారు. సోమవారం నుంచి బుధవారం వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
12న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల తిరస్కరణపై కలెక్టర్, ఆర్డీవో వద్ద అప్పీళ్లు, 14న మధ్యాహ్నం ఒంటిగంటకు అప్పీళ్ల పరిష్కారం, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ, అప్పుడే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 21న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. 24న కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు.