telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అర్నాబ్‌పై పోలీసులు దాడి‌..రంగంలోకి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా..!

Amit

రిపబ్లిక్‌ టెలివిజన్‌ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామి ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇంటీరియల్‌ డిజైనర్‌ మరణానికి సంబంధించిన విషయంలో ఆయనను మహారాష్ట్ర పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే…ఈ అరెస్టును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు ఖండించారు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరో సారి అపహాస్యం చేశాయంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. అర్నబ్ అరెస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఈ ఘటనను వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్యం నాలుగవ స్తంభంపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. శివసేన ప్రభుత్వం కాంగ్రెస్ ఆదేశాల మేరకు పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు. శివసేన ప్రభుత్వం కాంగ్రెస్ ఆదేశాల మేరకు పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ బలహీనమైన ప్రభుత్వం మహారాష్ట్రను ప్రమాదంలో పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే వారంతా ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.

Related posts