ఏపీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. షరీఫ్ కు కరోనా పాజిటివ్ రావడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
షరీఫ్ తిరిగి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ, సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆయన మరింతగా పుంజుకుని రావాలని, రాష్ట్రానికి ఆయన సేవలు అవసరమని ట్విటర్ లో పేర్కొన్నారు.