విశాఖ ఏరియా ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మాస్కులు అందించడం లేదనే బాధను సుధాకర్ వ్యక్తం చేశారు. దీంతో ఆయన పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని విపక్షాలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇదే అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందించారు.సుధాకర్ ను పిచ్చివాడుగా చిత్రీకరించేందుకు కుట్ర జరుగుతోందని తాము ఎంత మొర పెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వర్ల విమర్శించారు. ఇప్పుడు ఇదే అంశం వెనుక కుట్ర ఉందంటూ హైకోర్టుకు సీబీఐ చెప్పిందని అన్నారు. సీబీఐ దర్యాప్తులో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా దొషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు: భట్టి విక్రమార్క