ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. ఏపీ అంతటా ప్రస్తుతం టీడీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వ్యాఖ్యానించారు కడప జిల్లాలో ఈరోజు బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జీవీఎల్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
టీడీపీకి రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కదని వ్యాఖ్యానించారు. ఒక్క కడప లోక్ సభ సీటు కోసం టీడీపీ ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ రూ.15,000 కోట్లను ఖర్చు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.
పంచాయితీ ఎన్నికల పై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు…