telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోడెల చావుకు వైసీపీ సర్కారు, సాక్షి మీడియానే కారణం.. యనమల సంచలన వ్యాఖ్యలు

Yanamala tdp

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చావుకు వైసీపీ సర్కారు, సాక్షి మీడియానే కారణమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోరెన్సిక్ నివేదికలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలిందని తెలిపారు. కోడెలను విదేశాల్లో ఉన్న కుమారుడే చంపాడని వైసీపీ నేతలు సాయితో ఫిర్యాదు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి వ్యాఖ్యలు, మంత్రి బొత్స వ్యాఖ్యలు ఒకేలా ఉన్నాయన్నారు.

37 ఏళ్ల రాజకీయ జీవితంలో కోడెల 27 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారని యనమల గుర్తుచేశారు. కోడెల ప్రాణాలను జగన్ ప్రభుత్వం, వైసీపీ నేతలే బలి తీసుకున్నారని స్పష్టం చేశారు. ఆయన మరణానికి వైసీపీ నేతలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నరసరావుపేటలో తక్షణం నిషేధాజ్ఞలను ఎత్తివేయాలని కోరారు. ఓ మహానేత పార్థీవదేహానివకి ఆయన అభిమానులు వీడ్కోలు పలికే అవకాశం కల్పించాలన్నారు.

Related posts