telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఘన స్వాగతం: రోజా

Nagari TDP Ticket Gali Brothers

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఘన స్వాగతం లభిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో తన నియోజకవర్గం నగరిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా కూడా మళ్లీ తాను గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

2014 ఎన్నికల్లో జగన్ విజయం తథ్యమని తెలిసి చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. తమ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను వారి ద్వారానే వైఎస్ జగన్ తెలుసుకున్నారని అన్నారు. జగన్ ఏపీ సీఎం కావడం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు.

Related posts