ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని పొలిటికల్ వార్ నడుస్తోంది. మంగళవారం వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో.. ఇవాళ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ సంస్థలు, ప్రజాస్వామ్య హితైభిలాషులు అంతా బంద్కు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులపై బలంగా నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అయితే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు మరికొందరి నేతలపైనే కేసు నమోదు చేశారు మంగళగిరి పోలీసులు..నిన్న టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. ఈ కేసులో.. ఏ1గా నారా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రవణ్ పేర్లను చేర్చారు.. హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.