telugu navyamedia
క్రైమ్ వార్తలు

శ్రీకాకుళంలో స్యూల్ బ‌స్సు బోల్తా..

శ్రీకాకుళంలో విషాదం చోటుచేసుకుంది. ఉద‌యం విద్యార్థులంతా ఉత్సాహంగా బడికి బయలుదేరారు.ఇంతలోనే అనుకోని ప్రమాదం ఎదురైంది. బస్సుకు ఏదైనా అడ్డం వచ్చిందో లేక దానంతట అదే జరిగిందో తెలియదు కానీ అకస్మాత్తుగా బస్సు చెరువులోకి బోల్తా కొట్టింది. ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

వివ‌ర్లాలోకి వెళితే..
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని నల్ల చెరువులో బుధవారం ఉదయం కొంగర గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. బస్సు ఒక్కసారిగా చెరువులో బోల్తా పడటంతో ఓ విద్యార్థి బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.

ఈ ప్రమాద సమయంలో బస్సులో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. మిగిలిన విద్యార్థులను స్థానికులు చెరువులో నుంచి ఒక్కొక్కరిని బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెరువులో పడ్డ బస్సును వెలికితీస్తున్నారు.

Related posts