telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మీ ఆర్భాటాల కోసం ప‌సిపిల్ల‌న్ని చంపేస్తారా? -నారా లోకేష్

ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఊరేగింపు లో పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ తో ప‌సిపాప ప్రాణాలు కోల్పోవడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.

మీ ఆర్భాటాల కోసం శిశువుల్ని చంపేయడమే శిశు సంక్షేమమా మంత్రి గారు! నారా లోకేష్ ప్ర‌శ్నించారు. ఇది ముమ్మాటికి మంత్రి, పోలీసులు చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. చిన్నారి కొనప్రాణాలతో కొట్టుకుంటున్న కనికరించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts