telugu navyamedia
సినిమా వార్తలు

ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒకే వేదికపై కలవబోతున్నారు . అవును ఈ వార్త నిజమే . వీరిద్దరి కలయికకు ఆచార్య సినిమా వేదిక కాబోతుంది . మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ క‌లిసి నటించిన సినిమా “ఆచార్య “.  ఈ సినిమా  ఏఫ్రిల్‌ 29న విడుదలవుతుంది .

కొరటాల శివ దర్శకత్వంలో కొణిదల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ భారీ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 23 న విజయవాడ సిద్దార్ద కళాశాల ప్రాంగణంలో జరుగుతుంది .

CM Jagan invites Chiranjeevi

మెగాస్టార్ , రామ్ చరణ్, పూజ హెగ్డే , కాజల్ అగర్వాల్ తో పాటు ఇంత నటీనటులు , సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు . అత్యంత భారీ స్థాయిలో ఈ వేదిక రూపొందబోతుంది .

ఈ వేదికపై చిరంజీవి “ఆచార్య ” సినిమాకు ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారు .సినిమా టికెట్ల రేట్లను పెచాలని చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు .

Chiranjeevi: Megastar Chiranjeevi 'Acharya' Pre-Release Event‌Date Fix ..!

చిరంజీవి తో జగన్ సమావేశం తరువాత జగన్ సినిమా టికెట్ల రేట్లను పెంచారు . చిరంజీవి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన “ఆచార్య” సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వివిజయవాడలో నిర్వహించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది .

Chiranjeevi, Ram Charan starrer Acharya release postponed due to Covid-19 | Entertainment News,The Indian Express

ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి , అందుకు తమ ప్రభుత్వం చేయూత నిస్తుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలుగు సినిమా రంగానికి విజ్ఞప్తి చేశారు. జగన్ పిలుపుకు స్పందనగా చిరంజీవి తన ” ఆచార్య ” సినిమాను ఆంధ్ర ప్రదేశ్‌లో నిర్వహిస్తున్నారు .

Vintage Megastar is back with Saana Kastam song in Acharya

ఇదే వేదికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సినిమా రంగానికి సంబంధించి పలు వరాలను ప్రకటించే అవకాశం వుంది . “ఆచార్య ” సినిమా ప్రీ రిలీజ్ వేదికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సత్కరిస్తారని తెలుస్తోంది .

Related posts