telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కొల్లు రవీంద్ర నిర్దోషిగా బయటపడుతారు: కేశినేని నాని

kesineni-nani

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఓ హత్య కేసులో బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆయనను ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని ఈరోజు పరామర్శించారు. మంత్రి పేర్ని నాని అనుచరుడు, మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ రాజకీయ కక్షల్లో భాగంగానే రవీంద్రను ఇరికించారని ఆరోపించారు.

రవీంద్ర ఏ తప్పు చేయలేదనే విషయం అందరికీ తెలుసని చెప్పారు. ఆయన ఈ కేసులో నిర్దోషిగా బయటపడతారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేతలపై కక్ష సాధింపులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ప్రభుత్వం కక్ష సాధింపులను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని కేశినేని హితవు పలికారు.

Related posts