ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని తన నివాసం వద్ద గోశాలలో జరిగిన గో పూజలో వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.
సంప్రదాయ పంచెకట్టులో సీఎం జగన్ ఈ వేడుకల్లో కనిపించారు. తన నివాస ప్రాంగంణంలో పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ, సంస్కృతిక కార్యక్రమాలను వైఎస్ జగన్ దంపతులు వీక్షించారు. చిన్నారులతో సీఎం జగన్ సరదాగా కాసేపు ముచ్చటించారు.
ఈ వేడుకల్లో సీఎం జగన్ దంపతులతో పాటుగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గాయకులు మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్ సంక్రాంతి పాటలతో ఆకట్టుకున్నారు.
మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని అన్నారు. రైతులకు మనమంతా ఇచ్చే గౌరవం సంక్రాంతి అని తెలిపారు. సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ హయాంలో అమరావతి భజన: మంత్రి కొడాలి నాని