కేంద్రపథకాలకు దీటుగా తాజగా ఏపీ ప్రభుత్వం విశేష కృషి చేసిన వారికి ఏడాదికి రెండుసార్లు వైఎస్ పేరుమీద పథకం తోపాటు 10లక్షల నగదు కూడా అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల గోదావరి నదిలో మునిగిపోయిన బోటును వెలికి తీయడంలో విశేష కృషి చేసిన దర్మాడి సత్యం కు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డును ప్రకటించింది ప్రభుత్వం. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఈ విషయం చెప్పారు.
బోటు ప్రమాదం విషయంలో ప్రతిపక్షాలు ఎంత ఎద్దేవా చేసినా ప్రభుత్వం నిబద్దతతో వ్యవహరించిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును దర్మాడి సత్యం కు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని ఆయన తెలిపారు.దర్మాడి సత్యం బృందం పట్టు వదలకుండా నెల రోజుల పాటు విశేష కృషి చేసి గోదావరిలో మునిగిపోయిన బోటును పైకి తీశారు.