ఇసుక కొరతను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. లక్షల మంది కార్మికులు పనులు లేక పస్తులుంటున్నారని, సోమవారం కార్మికులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటక కార్యక్రమాన్ని చేపడతామని కన్నా ప్రకటించారు.
వివిధ పార్టీలు, సంఘాల నుంచి బీజేపీలో చేరడం మంచి పరిణామని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్య పట్ల తాము పోరాడతామని హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అఖిల భారత యాదవ సంఘం నాయకులతో పాటు జనసేన, టీడీపీ నాయకులు కన్నా సమక్షంలో బీజేపీలో చేరారు.