వేసవిలో నీటి సమస్యను పరిష్కరించేదుకు ఏపీ సర్కారు చర్యలు చేపట్టింది. ఎక్కడ నీటి సమస్య ఉన్నా తమ కాల్ సెంటర్ కు ఫోన్ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం జలవాణి పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటుచేశామని చెప్పారు. టోల్ ఫ్రీ నంబర్ 18004251899కు ఫోన్ చేసి తాగునీటి ఇబ్బందులను చెప్పాలని సూచించారు. తమకు ఇప్పటివరకూ తాగు నీటి సమస్యపై 3,813 ఫిర్యాదులు వచ్చాయనీ, వాటిలో 80.51 శాతం ఫిర్యాదులను పరీక్షించామని పేర్కొన్నారు.
ట్రాన్స్ పోర్టేషన్ విధానం ద్వారా రోజులకు 15,000 ట్రిప్పుల చొప్పున 3,494 నివాస ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పూర్తయిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లను ఇందుకోసం వాడుకుంటున్నామని చెప్పారు. అలాగే 469 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని నీటి కొరత లేకుండా చేస్తున్నామని ట్విట్టర్ లో చంద్రబాబు స్పందించారు.