telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 67,151 మందికి పాజిటివ్

Corona

దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 67,151 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో 1,059 మంది మృతి చెందారని పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 32,34,475 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 59,449కి పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. 7,07,267 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.నిన్నటి వరకు మొత్తం 3,76,51,512 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,23,992 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది.

Related posts