telugu navyamedia
వార్తలు సామాజిక

48 గంటల్లో హాస్టల్‌ ఖాళీ చేయాలి..తెలుగు విద్యార్థులకు ఇబ్బందులు

polution mask delhi

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు విశ్వవిద్యాలయాల హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లాలని విద్యార్థులకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పంజాబ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని హాస్టల్‌ను 48 గంటల్లో మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

దీంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ హాస్టల్‌లో దాదాపు 60 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. వారికి రైళ్లతో పాటు ప్రైవేటు ట్రావెల్స్‌లో రిజర్వేషన్లు దొరకట్లేదు. దీంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Related posts