నేడు 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్ లోని ద్రాస్ సెక్టార్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నాడు కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నానని వెల్లడించారు.
దేశం కోసం సైనికులు చేసిన వీరోచిత పోరాటం తన మదిలో నిలిచిపోయిందని అన్నారు.
“లడఖ్ కార్గిల్ యుద్ధానికి సాక్షిగా నిలుస్తుంది. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా జులై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం.
దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి.
దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారు. వీర సైనికుల త్యాగాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
కార్గిల్ విజయం ఏ ప్రభుత్వానిదీ కాదు ఏ ఒక్క దళానికో చెందినది కాదు కార్గిల్ విజయం దేశానిది అని అన్నారు.