ఏపీలో కరోనా ఉధృతి తగ్గుతూ వాస్తు ఉంది. ఇప్పటికే ఏపీలో 18 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 87,756 శాంపిల్స్ పరీక్షించగా 4,549మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 59 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 10,114 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,14,393 కి చేరగా.. యాక్టివ్ కేసులు 80013 గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 17,22,381 కరోనా నుంచి కోలుకోగా 11,999 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 2,05,38,738 కు చేరింది.