telugu navyamedia
రాజకీయ వార్తలు

చైనా సరిహద్దుల్లో భారతసైనికులను కలిసిన రాజ్‌నాథ్‌

Rajnath Singh inaugurates NIA office

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం చైనా దేశ సరిహద్దుల్లో పర్యటించారు. ఇండో-చైనా సరిహద్దు ప్రాంతమైన బుమ్లా పాస్ వద్ద రాజ్‌నాథ్‌సింగ్ భారతసైనికులను కలిశారు. సరిహద్దుల్లో పరిస్థితిని పరిశీలించిన కేంద్రమంత్రి సైనికులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న భారత సైనికులను కేంద్రమంత్రి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికులను కలిసే అవకాశం తనకు లభించిందని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. సైనికులతో కలిసి సరిహద్దుల్లో ఫోటోలు దిగారు. చైనా సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని సైనికులు తనకు చెప్పారని పేర్కొన్నారు.

Related posts