telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రాజేంద్రనగర్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేస్…

డాక్టర్ హుస్సేన్ రాజేంద్రనగర్ లో కిడ్నాప్ కేస్ కథ సుఖాంతం అయింది. డాక్టర్ హుస్సేన్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని తెలుసుకున్నా బంధువు ముస్తఫా..డాక్టర్ హుస్సేన్ ఇంటి పైన కిరాయి కి వుండే ఖలీద్ అనే వ్యక్తి ద్వారా కిడ్నాప్ చేయించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ముస్తఫా డాక్టర్ ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ వేసాడు. కిడ్నాప్ చేసేందుకు కొంత మందిని మాట్లాడుకొని హుస్సేన్ ను కిడ్నాప్ చేసాడు.

అయితే వాట్సాప్ కాల్ చేసి హుస్సేన్ కుటుంబ సభ్యులను డబ్బులు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు..ఆ డబ్బులు కూడా బిట్ కాయిన్ రూపంలో కావాలంటూ డిమాండ్ చేశారు. ఆ నెంబర్ ఆధారంగా వెహికిల్ ని ట్రెస్ చేసి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చిన సైబరాబాద్ పోలీసులు..వెంటనే అలర్ట్ అయిన ఏపీ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేసి డాక్టర్ ను  పోలీసులు సేవ్ చేసారు. తెల్లవారుజామున అనంతపురం పోలీసులు డాక్టర్ హుస్సేన్ ని సేఫ్ గా కాపాడారు. డాక్టర్ హుస్సేన్ ఇంటిపైన కిరాయికి ఉండే ఖలీద్ ను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించగా కిడ్నాప్ స్టోరీ మొత్తం బయటపడింది. 

Related posts