ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం హూజూర్ నగర్ ఉపఎన్నికపై ఉండదని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. వరంగల్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ..హూజూర్ నగర్ ఉపఎన్నికలో 20 వేల మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల నేతలే ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని అన్నారు.
ఆర్టీసీ కార్మికులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. తండ్రి పాత్రలో ఉన్న కేసీఆర్… తన పిల్లల వంటి ఆర్టీసీ కార్మికులను పిలిపించుకుని మాట్లాడతారని అన్నారు. పిల్లలు తండ్రిపై అలగడం సహజమేనని… కానీ, తండ్రి వారిని బుజ్జగిస్తారని చెప్పారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని మంత్రి అన్నారు.
అలా చేస్తే వారు నోరు మూస్తారు.. బీజేపీ నేత ముండే సంచలన వ్యాఖ్యలు!