కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడుతూ… నల్గొండ జిల్లా అనుముల మండలం చింత గూడెం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డితో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ది నాన్ లోకల్..అతను గెలిస్తే హైదరాబాద్ పోతాడని అన్నారు. గడిచిన ఏడు ఏళ్లలో సాగర్ లో ఏమి అభివృద్ధి చేశారో తెరాస వాళ్ళు చెప్పాలని… సాగర్ నియోజకవర్గపరిధిలో అన్ని లిఫ్ట్లు పెట్టించింది జానారెడ్డి అని గుర్తు చేశారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా ప్రతినిధిగా అనేక పనులు చేస్తే జానారెడ్డి ఏమి చేశాడు అంటారా ? అని ఫైర్ అయ్యారు. సాగర్ నియోజకవర్గంలో రెండు పడక గదుల నిర్మాణం జరిగిందా ? తెరాస ప్రభుత్వంలో చౌక ధరల దుకాణంలో చక్కెర, కిరోసిన్ బంద్ చేశారని నిప్పులు చెరిగారు. 2018 ఎన్నికల్లో గొర్రెల పంపిణీ అన్నారు కానీ రెండో విడత ఎంత మందికి ఇచ్చారని నిలదీశారు. 2018లో జానారెడ్డి గెలిచి ఉంటే గొర్రెల పంపిణీ పథకంపై నిలదీసేవారని పేర్కొన్నారు.
previous post
next post