telugu navyamedia
రాజకీయ వార్తలు

అలా చేస్తే వారు నోరు మూస్తారు.. బీజేపీ నేత ముండే సంచలన వ్యాఖ్యలు!

Pankaja Munde Shocking Comments Rahul

దేశవ్యాప్తంగా జరుగనున్న ఎన్నికల ప్రచారంలో నిబంధాలను పాటించాలని ఈసీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు భద్రతా దళాలను వాడకోకూడదంటూ ఈసీ సూచింది. అయినప్పటికీ నాయకులు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు పంకజ ముండే సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్నా లోక్‌సభ నియోజకవర్గంలో పంకజ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మీద పేలుడు పదార్థాలు ప్రయోగిస్తే, సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించి అనుమానాలు వ్యక్తం చేసేవారు నోరు ముస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంకజ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమెపై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.

Related posts