గురువారం హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి సమక్షంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలలోకి వెళుతున్నారు.
గత కొద్దిరోజులుగా గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అన్న చర్చ జరిగింది.
అయితే ఆ చర్చకు ఊతమిస్తూ ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటనలో కూడా ఆమె పాల్గొనలేదు. కేటీఆర్ కి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కూడా ఆమె ఫోటో ఎక్కడ కనిపించలేదు.