telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గత ఐదేళ్ల పాలనలో జరిగింది దోపిడీయే తప్ప అభివృద్ధి కాదు: బొత్స

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల పాలనలో జరిగింది దోపిడీయే తప్ప అభివృద్ధి కాదని అన్నారు. ఏ ఫంక్షన్ నిర్వహించినా ప్రకటనలకు, స్నోలు, పౌడర్లు, సోకులకు కోట్ల రూపాయలు దుబారా చేశారని ఆరోపించారు. తాను చేపట్టిన పురపాలక శాఖ విషయానికొస్తే, తాను బాధ్యతలు స్వీకరించే సమయానికి రూ.15 వేల కోట్ల అప్పు ఉందన్నారు. అనుభవజ్ఞులమని చెప్పుకుంటూ ప్రభుత్వం నడిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు.

గ్రామ సచివాలయాల ఆలోచన తెదేపాకు వస్తే ఎందుకు అమలు చేయలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఆస్పత్రులు ఉన్నచోటే క్యాంటీన్లు పెట్టాలనేది తమ ప్రభుత్వం ఆలోచన అన్నారు. దీనిపై విధివిధానాలకు ఆదేశించామనీ.. త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. ఆర్థిక పరిస్థితిని క్రమంగా చక్కదిద్దుతున్నామన్నారు. ఇప్పటివరకు పాత బకాయిలు చెల్లించడానికే సరిపోయిందని చెప్పారు.

Related posts