telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు జాతి గుర్తుంచుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్: చంద్రబాబు

chandrababu

తెలుగు జాతి గుర్తుంచుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు.

రాయలసీమను ఆదుకున్న ఏకైక వ్యక్తి కూడా ఎన్టీయారేనని పేర్కొన్నారు. సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్లని ఎన్టీఆర్ పదేపదే చెప్పేవారని, ఆయన స్ఫూర్తితో పనిచేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నివాళులర్పించినట్టు టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అనంతరం కార్యాలయంలో చంద్రబాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఆ మహనీయుడి ఆశయసాధనే లక్ష్యంగా పనిచేస్తామని లోకేశ్ పేర్కొన్నారు.

Related posts