ఈనెల 26 నుంచి రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నట్లు 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారుల సంఘాలు హెచ్చరించాయి. ఈమేరకు ఆల్ ఇండియా బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ అధికారుల అసోసియేషన్, భారత జాతీయ బ్యాంకు అధికారుల కాంగ్రెస్, బ్యాంకు అధికారుల నేషనల్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా నోటీసు ఇచ్చాయి.
ఇటీవల బ్యాంకుల విలీనానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నాయి.