telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీకి అమిత్ షా.. నేడే పర్యటన..

TDP Mla anitha comments Roja YCP

బీజేపీ నేతలు ప్రజాదరణ కోసం తాజాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ లో అనేక తాయిలాలు ప్రకటించినవిషయం తెలిసిందే. వాటితో ప్రజలు చల్లబడ్డారు అనుకున్నట్టుగానే ఉంది. దానితో మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. నేటి నుంచి శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ చేపట్టిన బస్సు యాత్రను అమిత్‌ ప్రారంభించనున్నారు. 15 రోజుల పాటు 85 నియోజకవర్గాల్లో బీజేపీ బస్సు యాత్ర సాగనుంది.

గతంలో అనేక నిరసనల నడుమ అమిత్ షా తిరుపతి రావడం తెలిసిందే. అయితే ఇటీవల ప్రధాని మోడీ కూడా ఏపీలో పర్యటించాలని అనుకోవడం, దానికి ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఉండటంతో, ఆలోచన మార్చుకున్నారు. అయితే బడ్జెట్ మళ్ళీ ప్రజలను బీజేపీ వైపుకు తిప్పనుందా.. అనేది నేటి అమిత్ షా పర్యటనను బట్టి తేలిపోతుంది. నేడు కూడా అమిత్ షా పర్యటనలో తీవ్ర నిరసనలకు ఏపీలోని ప్రభుత్వం, ఇతర పార్టీలు సిద్దంగానే ఉన్నాయని సమాచారం. ఇంతకీ నేటి పర్యటన సజావుగా జరుగనుందా.. చూడాల్సి ఉంది.

Related posts