telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కోవిడ్‌ సంక్షోభం : భారత్‌కు గూగుల్ రూ.135 కోట్ల సహాయం!

google office

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.73 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 3,52,991 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 2,812 మంది మృతి చెందారు.  ప్రతి రోజూ 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇండియా మరింత డేంజర్ లో పడనుంది. ఇలాంటి సమయంలో ఇండియాకు సహాయం చేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గూగుల్ ముందుకు వచ్చింది. ఏకంగా రూ.135 కోట్ల రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న గీవ్ ఇండియాకు, యూనిసెఫ్ కు ఈ ఫండ్ అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇండియాకు సహాయమందించేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ లాంటి దేశాలతో పాటు పాకిస్థాన్ కూడా ముందుకు వచ్చింది. కొవిషీల్డ్ టీకా తయారీకి అవసరమైన ముడి పదర్థాలను భారత్‌కు పంపాలని అమెరికా నిర్ణయించింది. అలాగే ఇండియా కు ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఫ్రాన్స్, బ్రిటన్ కూడా ఒక అడుగు ముందుకు వేశాయి. 

Related posts