telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సినిమా వార్తలు

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై .. పోసాని విజ్ఞప్తి.. !

posani krishna murali EC Notice

నటుడు పోసాని కృష్ణ మురళి, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను బయటకు రాకుండా చేస్తారని చాలా మంది చెబుతున్నారని, ఇది వాస్తవంగా జరిగిన కథ కాబట్టి, సెన్సార్ బోర్డు సైతం ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా సర్టిఫికేట్ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. తాజాగా, సినిమా ప్రమోషన్ నిమిత్తం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పోసాని, ఈ సినిమాలో ఏ సీన్ ను కట్ చేసినా, దాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. ఈ మేరకు సెన్సార్ బోర్డు సభ్యులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, సినిమాకు కట్స్ చెప్పవద్దని అన్నారు.

థర్టీ ఇయర్స్ పృధ్వీ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, బయోపిక్ అంటే వాస్తవాన్ని చెప్పాల్సిందేనని అన్నారు. నాడు ఏం జరిగిందో నేడు వర్మ అదే చెప్పారని, ఏం చెప్పారన్నది 22న తెలుస్తుందని అన్నారు.

Related posts