ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అధికంగా కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాలను మరో 6 నుంచి 8 వారాల పాటు లాక్ డౌన్ చేయాలని ఐసీఎంఆర్ సూచనలు చేసింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ వెల్లడించారు. ప్రస్తుతం 528 జిల్లాల్లో 10 శాతం పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని చెప్పిన ఆయన..అధిక పాజిటివిటీ ఉన్న జిల్లాలను మూసేయాలని పేర్కొన్నారు. లేనిచో దేశానికి ప్రమాదం తప్పదన్నారు.
next post
పోటీ సినిమా పరంగానే… వ్యక్తిగతంగా కాదు… మోహన్ లాల్ పై మమ్ముట్టి వ్యాఖ్యలు